
నెల్లిమర్లలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ డిప్లామా, ఐటీఐ, బీటెక్, పీజీ అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. 12 బహళ జాతి కంపెనీలు పాల్గొంటాయన్నారు. అభ్యర్థుల వివరాలను https://naipunyam.ap.gov.inఅనే వెబ్సైట్లో పొందుపరచాలన్నారు.